శాసనసభలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం తెలిపిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR కి పాలాభిషేకం చేశారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మర్రిగూడెం గ్రామ శివారులోని వరి పంట పొలాల నడుమ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు కెసిఆర్ కు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మంచి మనసున్న రాష్ట్ర ముఖ్యమంత్రి KCR మాత్రమే ఇలాంటి ఘనత సాధించగలరని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదని రైతుబంధు, కళ్యాణ లక్ష్మి ,ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గల్లా సైదులు, మండల కమిటీ సభ్యులు తాటి బిక్షం, ఆటో యూనియన్ అధ్యక్షుడు చుక్కబొట్ల శ్రీనివాస్, మండల మైనార్టీ అధ్యక్షుడు జానీ మియా, రవివర్మ ,వెంకయ్య, చంద్రయ్య, నరసింహారావు, పానకాలు,సీతమ్మ పుల్లమ్మ,మల్లమ్మ, సాయమ్మ ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.