గణేష్ నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నల్లచెరువు సమీపంలోని కొలనులో ఏర్పాటు చేయడం జరిగిందని ఉప్పల్ కార్పోరేటర్ మందముల రజిత పరమేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి జోనల్ కమీషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి ఉప్పల్ లోని గణేష్ నిమజ్జన కొలను పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే విధంగా ముందస్తు చర్యలు చేపట్టామని కమీషనర్కు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ మందు మూల పరమేశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. అశోక్రెడ్డి, డిప్యూటి కమీషనర్ అరుణకుమారి, ఈ ఈ.నాగేందర్, డిఇ.నికిల్రెడ్డి, ఏఈ. వసంత ,ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ ,లింగంపల్లి రామకృష్ణ, సుంకు శేఖర్రెడ్డి, అలుగుల అనిల్కుమార్, జనగాం రామకృష్ణ, మంద మురళీకృష్ణారెడ్డి, పాలడుగు లక్ష్మణ్, ప్రశాంత్రెడ్డి, బద్రి,భాను ,ఫీటర్, జీతూ, నరేష్ , సతీష్ ,రాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
previous post