ముదిరాజులు ఐక్యతతో పోరాటం చేసినప్పుడే మనహక్కులు సాధించుకోగలమని TRMS తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండల TRMS కమిటీ నియామక సమావేశంలో మండల సహాయ కార్యదర్శిగా పిట్ల వెంకటేశం, సలదారు నర్సింహులు ను నియమించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ముదిరాజ్ లు ఆర్థికంగా అణచివేతకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు పోరాటం చేస్తున్నట్లుగా ముదిరాజులు ఏకమై ప్రభుత్వం పైన పోరాటం చేసినప్పుడే హక్కుల సాధన వీలుపడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి కొమురవెళ్లి నర్సింహులు మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం ముదిరాజులను ముదిరాజులే మోసం చేస్తున్నారని అలంటి వాళ్ళను పక్కన పెట్టి పోరాటం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కండ్లకోయ బాల కృష్ణ, మండల కన్వీనర్ రమేష్, నాయకులు కోరమేన యాదగిరి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.