మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
శిక్షణ సమయంలో విమానాలు కూలాయని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మోరీనా కలెక్టర్ తెలిపారు. SU-30 నుండి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.