కామారెడ్డి బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ చేప పిల్లలను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే చెరువుల్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా రాయితీ చేప పిల్లలను ప్రతి ఏటా పంపిణీ చేస్తున్నామన్నారు . ఈ ఏటా 95400 చేప పిల్లల్ని పంపిణీ చేస్తూనమని జిల్లా మత్య శాఖ అధికారిణి పూర్ణిమ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు బిచ్కుంద ఎంపిపి అశోక్ పటేల్, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, పాషా సెట్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.