హైదరాబాద్ కాచిగూడ డివిజన్ లోని చెప్పల్ బజార్ సిమెంట్ నాలా ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్. గౌతం రావు, కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమారమేష్, బీ.జే. పీ సీనియర్ నాయకులు కన్నె రమేష్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసు, దిలీప్, కె.నర్సింగ్ యాదవ్, పంకజ్, భీమ్ రాజ్, రవి యాదవ్, బాబ్జి, సదానంద తదితరులు కూడా పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట