30.7 C
Hyderabad
April 29, 2024 04: 20 AM
Slider విశాఖపట్నం

షాడో మేయర్ చేతిలో జీవీఎంసీ బందీ

#pawankalyan

షాడో మేయర్ చేతిలో జీ వీ ఎం సీ అవినీతి కూపంలో కూరుకుపోయిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకుడు, జీవీఎంసీ 32 వ వార్డ్  కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. ఈ విషయం ఫై పోరాటం చేస్తామని ప్రకటించారు. జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం జరిగిన విశాఖ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కార్మికులు సమస్యలు మీద ప్రస్తావిస్తే సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు.

బడ్జెట్ సమావేశం మధ్యలో కమిషనర్ వెళ్లిపోవడం ఫై ప్రశ్నించినందుకు జనసేన కార్పొరేటర్ నైన తనను మేయర్ హరి వెంకట కుమారి  ఏకపక్ష నిర్ణయం తో సస్పెండ్ చెయ్యడం చాలా అన్యాయం అని విచారం వ్యక్తం చేశారు. పలు అంశాల్లో తీర్మానం చేస్తున్నారు. కొన్ని పనులు ఎందుకు ఆగుతున్నాయి. మేయర్ వార్డులో మాత్రమే వందల కోట్లతో పనులు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారి కోసం ప్రశ్నిస్తే, మేయర్ బడ్జెట్ ఆమోదిస్తే చర్చిద్దాం అంటున్నారు.

కమిషనర్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం అన్యాయం. సమస్యల మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులతో కొంతమంది జల్సా చేస్తున్నారు. జీ వీ ఎం సీ పాలక వర్గం దోచుకోవడం, దాచు కోవడంతోనే సరిపోతుంది అని అన్నారు.

తన వార్డులో రూ. 32 లక్షలతో చేట్టిన కళ్యాణ మండపం పనులు ఆపేశారు అని మండి పడ్డారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కౌన్సిల్ మీటింగ్స్ కి మీడియా ప్రవేశం మీద కూడా ఆంక్షలు సరికాదు అని విమర్శించారు. ఎం.పి.నిధులు రూ.10 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. సిరిపురంలో రూ.83 కోట్లకు టి డి ఆర్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు.

ప్రభుత్వం సాండ్, లాండ్, వైన్ విధానం చందంగా వుందని  ఎద్దేవా చేశారు. మేయర్ వార్డుకు గతంలో కోటిన్నర ఇస్తామని అన్నారు, ఇప్పుడు రెండు కోట్లు ఇస్తాము అని మభ్య పెడుతున్నారు అని ఆయన విమర్శించారు. మునిసిపల్ కార్మికులకు గురువారం తన నివాసంలో నిత్యావసరాలు పంపిణీ చేస్తామని అన్నారు.

జన సేన ఫ్లోర్ లీడర్, 33 వార్డు కార్పొరేటర్ భీసెట్టి వసంత లక్ష్మి మాట్లాడుతూ, అంకెల గారడీ బడ్జెట్ అని , వైసీపీ నేతలు దోచుకోవడానికి బడ్జెట్ తయారు చేశారు అన్నారు. అన్ని వార్డులలో అభివృద్ధి చేశాముఅని చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో గతం కన్నా 10 శాతం పెంచాము అన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు లేవు. టి డి ఆర్ స్కాం మయంగా మారింది అని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ జన సేన ప్రభుత్వం వస్తుంది అన్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె మీద ప్రభుత్వం స్పందన లేదు, మేయర్ కూడా స్పందించకుంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో మహా ధర్నా చేస్తాము అన్నారు. 39 వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ మాట్లాడుతూ, నాగరాజు సస్పెన్షన్ అన్యాయం అని మండి పడ్డారు. పోర్ట్ నుంచి రావల్సిన 51 శాతం నిధులు కోసం పాలకవర్గం కృషి చేయాలి అని కోరారు.

Related posts

లఖీంపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

Sub Editor

గౌలిపురాలో ఘనంగా ఆషాఢ బోనాలు

Satyam NEWS

కాంగ్రెస్ హిమాచల్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుంది

Murali Krishna

Leave a Comment