40.2 C
Hyderabad
April 26, 2024 14: 06 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు కరోనా కేసులు

#Nagarkurnool Hospital

నాగర్ కర్నూలు జిల్లాలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కరోనా పాజిటివ్  గా నిర్ధారణ అయిందని, బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన  కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు.

అదేవిధంగా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో హైదరాబాద్ కు చెందిన పాలెం కు వచ్చిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందనిన ఆయన తెలిపారు. వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ వ్యక్తులను గుర్తించే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారని ఆయన అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా వైద్య శాఖ అధికారి సుధాకర్ లాల్ ఒక ప్రకటనలో కోరారు.  

Related posts

తమ్ముడ్ని తిడుతున్నా ఉలకని పలకని చిరంజీవి

Satyam NEWS

నో ఇష్యూ:షిరిడీ అంశంలో ప్రభుత్వ జోక్యం ఉండదు

Satyam NEWS

రేజింతల్ వినాయకుడికి మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment