సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖ కవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కలిశారు. గోరెటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నేపధ్యంలో ఆయన డిల్లీ లో శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరెటి వెంకన్నను ఎన్వీ రమణ అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీజేఐకి వెంకన్న వల్లంకి తాళం కవితా సంపుటిని బహుకరించారు. ఎన్వీ రమణ అభ్యర్థన మేరకు వెంకన్న అడవి తల్లిపై పాటను పాడి వినిపించారు.