ఇచ్చాపురంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న శంఖారావం కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్యనేతలను లోకేష్ పేరుపేరునా పలకరించారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన ఇచ్చాపురం బయలుదేరారు. ఇచ్చాపురంలో రేపటి శంఖారావం కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇచ్చాపురంలో రేపు ఉదయం 10.30గంటలకు శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.
previous post