తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
ఎమ్మెల్యే రోజా విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి నేడు కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ మొక్కలే మానవాళికి జీవనాధారం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటుదాం. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అన్నారు.