మల్లంపల్లి మండల జేఏసీ కి 10 గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు పూర్తి మద్దతును తెలిపారు. మల్లంపల్లి మండల జేఏసీ ఆధ్వర్యంలో 10 గ్రామ పంచాయతీ సర్పంచులను, ఎంపీటీసీలను కలిసి మండల ఉద్యమ కార్యాచరణను వారికి వివరించారు. ఈ సందర్భంగా దేవనగర్ శ్రీనగర్ రామచంద్రపూర్ ముద్దనూరు తండా కొడిషల కుంట భూపాలనగర్ శివ తండా మహమ్మద్ గౌస్ పల్లి గుర్తుర్ తండా ఆయా గ్రామాలను కలిసి న మల్లంపల్లి జాక్ మండలం ప్రయోజనాలను, ఆయా గ్రామ పంచాయతీ నాయకులకు జేఏసీ ఆధ్వర్యంలో వివరించారు.
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నాయకులనుండి అపూర్వ స్పందన లభించింది. మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి వారి పూర్తి మద్దతు తెలియ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామపంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు మాట్లాడుతూ, 2018లో ముఖ్యమంత్రి మండల హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు అమల్లోకి రాకపోవడం బాధాకరం. గత కొద్ది రోజులుగా అనేక జిల్లాలలో కొత్త మండలాలు ప్రకటిస్తూన్నా మల్లంపల్లి మండలం ప్రకటించకపోవడం బాధాకరం.
మల్లంపల్లి మండలం అయితే మా గ్రామాలకు రవాణా సౌకర్యం పెరుగుతుంది. మల్లంపల్లి మండలం అయితే పరిపాలపరంగా, విద్య వైద్య పరంగా వాణిజ్యపరంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం మల్లంపల్లి మండలం ప్రకటించాలని వారు కోరారు. లేనిపక్షంలో 10 గ్రామ పంచాయతీల నుండి అధిక సంఖ్యలో జనం మండల ఉద్యమంలో పాల్గొంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు , సమన్వయ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.