కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల క్షేత్రం లో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కామాక్షి త్రెతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి సతీ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంకా హత్యరాల చైర్మెన్ పూల నరసింహులు, హత్యరాల టెంపుల్ ఈవో, మందరం మాజీ సర్పంచి వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, అత్తిరాల మాజీ చైర్మన్ శివయ్య, పోలిమురళి, రెడ్డి, పాపినేని విశ్వనాథ రెడ్డి, సుబ్బరాజు, గీతాల నరసింహా రెడ్డి, పసుపులేటి సుధాకర్, డీసీఎంఎస్ చైర్మన్ దండు గోపి తదితరులు పాల్గొన్నారు.