రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ వీతిక శేరు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సైదాబాద్ SBH కాలనీలో హీరో నందు మొక్కలు నాటాడు.
ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని అందులో తాను కూడ భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు.
ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క అయినా నాటండి
ఈ సందర్భంగా సవారీ చిత్రం యూనిట్ బృందం సభ్యులు హీరోయిన్ ప్రియాంక శర్మ, దర్శకుడు సాహితి మోత్కూరి, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, శ్రీకాంత్, జీవన్ లను మొక్కలు నాటాలని కోరారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వతహాగా ఎవరికివారు మనిషికి ఒక మొక్క అయినా నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ కాలనీ వాసులు పాల్గోన్నారు.