గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామములో అమరావతి రాజధాని కృష్ణాయపాలెం ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 437 రోజు నిర్వహించారు.
మూడు రాజధానుల కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ రోజు శుక్రవారం హీరో శివాజీ కృష్ణాయపాలెం గ్రామానికి విచ్చేసి ప్రభుత్వాలు ప్రజలపై ఎంత అమానుషంగా తమ మోసపూరితమైన విధివిధానాలను అవలంబిస్తూ రాష్ట్రాన్నే కాదు దేశాన్నికూడా నాశనం చేసే స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాలను ప్రజలుగా మీకు ఉన్న హక్కులతో ఎదిరించి పోరాడాలి అనే నిజాలను నిర్భయంగా తమ సహజమైన ధోరణిలో తన బాణీని వినిపించి సినీ హీరో కాదు ఈ సమాజ రియల్ హీరో అని నిరూపించుకున్నారు.
అమరావతే ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా కొనసాగుతుందని దీనిని ఆపే హక్కు ఎవ్వరికీ లేదని ఉద్ఘాటించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ రైతులు, రైతు కూలీలు మరియు మహిళలు పాల్గొన్నారు