ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమానీనదాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరో ఇరవై ముప్పై ఏళ్లలో గంగోత్రి లాంటి పెద్ద హిమానీనదాలు అంతరించిపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో హిమాలయాల్లో ఉన్న హిమానీనదాలు కరిగిపోతే విపత్తు వస్తుందని భయపడుతున్నారు.
పర్యావరణ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది. చాలా పెద్ద పెద్ద నదులు ఎండిపోతాయి. ఒక్క భారతదేశమే కాదు మన పొరుగు దేశాలు కూడా చుక్క నీటి కోసం అలమటిస్తాయి. ఈ హిమానీనదాల ద్రవీభవన రేటు చాలా ఎక్కువగా ఉంది. భారతదేశం, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్తో సహా అనేక దేశాలు దీని బారిన పడతాయి.
ఈ దేశాలు కొన్ని సంవత్సరాలలో భయంకరమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి. హిమాలయ హిమానీనదాలు 10 రెట్లు వేగంగా కరుగుతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 2000 సంవత్సరం తర్వాత ఈ వేగం పెరిగిందని అధ్యయనంలో స్పష్టంగా తేలింది.