సాయుధ పోరాటం లో ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధీరుడు, అజాద్ హింద్ ఫౌజ్ స్ధాపించి బ్రిటిష్ వారి గుండెల్లో మించిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని హిందువాహిని విభాగ్ కో కన్వీనర్ హౌదేకర్ అభిలాష్ అన్నారు.
నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని హిందువాహిని ఆధ్వర్యంలో వివేకానంద చౌక్ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు. అనంతరం వనపర్తి జిల్లా ఆసుపత్రిలో రక్తదానం చేశారు.ఈ కార్యక్రమానికి వనపర్తి పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభిలాశ్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ గా భారత ప్రధానమంత్రి ప్రకటించడాన్ని హర్షిస్తున్నామన్నారు. భారత స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు వెలకట్ట లేనివని కొనియాడారు.
భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై పోరాడిన ధీరుడు మహా దేశభక్తుడు, భరతమాత ముద్దుబిడ్డ ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలను, త్యాగాలను ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన బాటలో నడవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గం అనుసరణీయం అని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవడానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్,భేటి బచావో ప్రముఖ్ నరేష్,అనిల్ కుమార్,రోహిత్,రాకేష్,మహేష్,నాని,ప్రేమ, నరేష్,లడ్డు,తదితర హిందువాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి