రూపాయి ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. గురువారం అమెరికా డాలర్తో పోలిస్తే రూ.80.28 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు బుధవారం నాడు రూపాయి 79.98 వద్ద ముగిసింది. బుధవారం, రూపాయి తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.45కి చేరుకుంది. మరోవైపు, డాలర్ గత 20 ఏళ్లలో అతిపెద్ద జంప్ను చూసింది.ద్ర వ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
బ్యాంక్ బెంచ్మార్క్ ఫండ్స్ రేటు వరుసగా మూడవ పెరుగుదల తర్వాత 3% నుండి 3.25%కి పెరిగింది. 2023 నాటికి వడ్డీ రేట్లు 4.6 శాతానికి పెరుగుతాయని అంచనా. భారత్తో పాటు ప్రపంచం మొత్తం మీద దీని ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లో భారీ పతనం ఏర్పడి మార్కెట్ కనిష్ట స్థాయుల్లోనే ముగిసింది. డౌ జోన్స్ 522 పాయింట్లు పతనమై 30184 స్థాయి వద్ద ముగిసింది. మరోవైపు నాస్ డాక్ 205 పాయింట్లు నష్టపోయి 11,220 పాయింట్ల వద్ద ముగిసింది. S&P కూడా 2% క్షీణించింది.