35.2 C
Hyderabad
April 27, 2024 13: 57 PM
Slider సంపాదకీయం

దేశం విస్తుపోయేలా ఏపీలో దొంగ ఓట్లు

#jagan

ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబరులో ప్రకటించి సంచలనానికి తెరలేపింది. జీరో నెంబరు, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లు ఏపీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో యావత్ ప్రజానీకం విస్తుపోయింది. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణాలుగా ఈవీఎంల ట్యాంపరింగ్, నవరత్నాలు, ఒక్కఛాన్స్ లాంటివి కారణమయ్యాయని అందరూ భావించారు కానీ అంతకంటే పెద్ద గూడుపుఠాణి దొంగ ఓట్లన్న సంగతి ఇన్నాళ్లకు బయటపడింది. దొంగ ఓట్లు ప్రభావం ఇంత ఉంటుందా అనిపించవచ్చుగానీ లోతుగా ఆలోచిస్తే ఫలితాలను తారుమారు చేయడంలో అవే కీలకం అన్నది స్పష్టమవుతోంది.

ఏపీలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని జూన్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందనగా బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పునపరిశీలనను ఎన్నికల సంఘం చేపట్టడంతో దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగు చూసింది. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తమైంది.

2019లో ఫలితాలు ఎలా తారుమారయ్యాయో ఓసారి చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 వేల కన్నా తక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ దాదాపు 21 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే 5 వేల నుంచి 10 వేల తేడాతో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు పోయాయి. 10 వేల నుంచి 15 వేల మధ్య మరో 23 సీట్లు చేజారాయి. అలా చూస్తే ఈ సంఖ్య 67కు చేరింది. తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లను వీటికి కలిపితే తెలుగు దేశం పార్టీకి 90 సీట్లు దక్కేవి. కానీ దొంగ ఓట్ల కారణంగా అలా జరగలేదు.

తెలుగుదేశం ను దెబ్బ తీసిన దొంగ ఓట్లు

సాధారణంగా 1000 నుంచి 1500 ఓట్లకు ఒక బూత్ ఏర్పాటవుతుంది. అంటే ఒక్కో శాసనసభ నియోజక వర్గానికి 250 నుంచి300 బూత్ లు ఉంటాయి. ఒక్కో బూత్ లో 18 దొంగ ఓట్లు పడితే దాదాపు 5000 వేల ఓట్ల తేడా వచ్చేస్తుంది. ఆ తేడానే 2019లో తెలుగు దేశం పార్టీ కొంపముంచింది. అంటే నైతికంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. అందుకే ఫేక్ ఓట్లను రాయించుకోవడానికి వైసీపీ తన శాయశక్తులా ప్రయత్నించింది.. మళ్లీ ప్రయత్నిస్తోంది.

ఒక్క ఓటు విలువ ఎంత గొప్పదో దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది. ఇలాంటి దొంగ ఓట్లను తొలగించుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేతలు ఉన్నారు. మొదట్లో ఈ విషయం తెలియక ఈవీఎం ల ట్యాంపరింగ్ అనుకున్నారు. పోలింగ్ రోజున బూత్ ఏజంట్ల నిర్లక్ష్యం మూలంగా ఇవి బయటపడలేదు. అందుకే ఇప్పుడే మేలుకోవాలి. ప్రతి బూత్ లోనూ ఓట్ల వెరిఫికేషన్ సక్రమంగా జరగాల్సిందే.

గ్రామస్థాయి కార్యకర్తలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే తప్ప దొంగ ఓట్లను అరికట్టలేదు. ఎన్నికలకు సమయం కూడా సమీపిస్తోంది. ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్ పై దృష్టి సారిస్తే ఈ దొంగ ఓట్లను అరికట్టడం చాలా తేలిక. ఓటర్ల సంఖ్య కూడా 2019 నాటికీ ఇప్పటికే బాగా పెరిగింది. ఏపీలో దాదాపు నాలుగు కోట్ల ఓటర్లు ఉన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా నేతలు ముందే మేలుకుంటే మంచింది. అందుకే క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాల్సిందే.

Related posts

కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భవన నిర్మాణ కార్మికులు

Satyam NEWS

బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్న కోమటిరెడ్డి

Satyam NEWS

హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి

Satyam NEWS

Leave a Comment