దిశ దినపత్రిక శేరిలింగంపల్లి ఇంఛార్జీ తుడుం భూమేష్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరించారు. సోమవారం కేపీహెచ్ బీ సీఐ కిషన్ కుమార్ ను యూనియన్ కు అతీతంగా పలు యూనియన్ నాయకులు కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
నిజాలను నిర్భయంగా రాస్తూ, అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతున్న దిశ జర్నలిస్ట్ భూమేష్ పై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని, సంబంధం లేని డేట్ లైన్ వార్తలను తనకు ఆపాదిస్తూ కేసులు పెట్టడం, 41 సీఆర్ పీ నోటీసులు తీసుకోవాలంటూ ఒత్తిడి చేసి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
పోలీసులు రాజకీయ నాయకుల వత్తిడి కి గురికావాల్సి అవసరం లేదని, ఇది ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భూమి శ్రీనివాసరెడ్డి, ఎర్ర యాకయ్య, లక్ష్మన్, మురళి,కొండల్ రెడ్డి, మహేందర్, దుర్గ ప్రసాద్, కిషోర్ చారి, రాజు రెడ్డి, గోపి, లక్ష్మణ్ గౌడ్, శంకర్, మహేందర్, వసంత్ కుమార్,హరి, సాగర్ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.