*యశోదా ఆసుపత్రి లో పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అస్వస్తతకు గురయ్యారు. శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సిన ఆయన అనారోగ్యం కారణంగా తన పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోధా ఆసుపత్రి కి వచ్చారు. ఆయనకు సిటీ స్కాన్ , యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు . రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని, జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిసస్తున్నామని , సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఎం.వి.రావు తెలిపారు . కేసిఆర్ వెంట భార్య తో పాటు ఎంపి సంతోష్ వున్నారు .