తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా నాయకుడు కరణం బలరాం తీవ్ర అవమానం పాలయ్యారు. చీరాల నియోజకవర్గంలోని గవినివారిపాలెం కు నేడు ఆయన పర్యటనకు వెళ్లగా గ్రామస్తులు ఆయనను తరిమి కొట్టారు.
తెలుగుదేశం పార్టీలో గెలిపించుకుంటే పార్టీ ఫిరాయిస్తావా అంటూ నిలదీశారు. ఎంతో కష్టపడి టీడీపీని గెలిపించు కుంటే వైసీపీ నాయకులతో కలిసి కార్యకలాపాలు చేస్తున్నారని నిగ్గదీసి అడిగారు.
అక్కడి పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. దాంతో కరణం బలరాం వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోలీసులు ఆయనను సురక్షితంగా కారులో ఎక్కించినా ఆయనతో వచ్చిన ఒక కార్యకర్తకు స్థానికులు దేహశుద్ధి చేశారు.