31.7 C
Hyderabad
May 2, 2024 10: 12 AM
Slider ప్రకాశం

పార్టీ ఫిరాయింపుపై కరణం బలరామ్ కు తీరని అవమానం

#karanam balaram

తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా నాయకుడు కరణం బలరాం తీవ్ర అవమానం పాలయ్యారు. చీరాల నియోజకవర్గంలోని గవినివారిపాలెం కు నేడు ఆయన పర్యటనకు వెళ్లగా గ్రామస్తులు ఆయనను తరిమి కొట్టారు.

తెలుగుదేశం పార్టీలో గెలిపించుకుంటే పార్టీ ఫిరాయిస్తావా అంటూ నిలదీశారు. ఎంతో కష్టపడి టీడీపీని గెలిపించు కుంటే వైసీపీ నాయకులతో కలిసి కార్యకలాపాలు చేస్తున్నారని నిగ్గదీసి అడిగారు.

అక్కడి పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. దాంతో కరణం బలరాం వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పోలీసులు ఆయనను సురక్షితంగా కారులో ఎక్కించినా ఆయనతో వచ్చిన ఒక కార్యకర్తకు స్థానికులు దేహశుద్ధి చేశారు.

Related posts

300 కోట్ల రూపాయలతో కోవూరులో నీటిపారుదల ప్రాజెక్టులు

Satyam NEWS

ప్లాన్ మిస్: జైషే ఉగ్రవాదుల కుట్ర భగ్నం ఐదుగురి అరెస్ట్

Satyam NEWS

అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దు

Satyam NEWS

Leave a Comment