40.2 C
Hyderabad
April 29, 2024 15: 28 PM
Slider జాతీయం

దేశంలో దాడులకు ఉగ్రవాదుల భారీ ప్లానింగ్‌

దేశంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్‌ వేస్తున్నారా.? ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రిపబ్లిక్‌ డేను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరగనున్నాయా.? అంటే ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు ఉగ్ర దాడులు జరగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పెద్ద స్థాయి నాయకులతో పాటు, సెక్యూరిటీ ఫోర్స్‌ క్యాంప్స్‌పై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు ఉగ్రవాదులు.. జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాలైన మార్కెట్లు, రైల్వేస్టేషన్‌లు, బస్‌ స్టాండ్స్‌, మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు అలర్ట్‌ కావాలని, ఎయిర్‌పోర్ట్స్‌ లాంటి ప్రదేశాల్లో ఏదైనా దాడులు జరిగితే వెంటనే స్పదించేలా యాక్షన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించాయి.

ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పలు కీలక విషయాలు తెలిపారు. ‘భద్రతా దళాలు అలర్ట్‌గా ఉండాలని. ముఖ్యంగా క్యాంప్‌ ఏరియాల్లో ఉండే వారు లోపల, బయట విధుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా క్యాంప్‌ ప్రాంతాలన్నీ నిఘాలో ఉంచాలని సూచించారు.

Related posts

మోడీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్‌కు మద్దతు

Murali Krishna

కరోనా ఎలర్ట్: క్వారంటైన్ కేంద్రానికి తీసుకువెళ్లే సిబ్బందికి ఇబ్బంది

Satyam NEWS

లక్కీ ఛాన్స్: డిప్ ద్వారా ఇండ్ల నెంబర్లు కేటాయింపు

Satyam NEWS

Leave a Comment