38.2 C
Hyderabad
April 29, 2024 13: 12 PM
Slider జాతీయం

కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదు

#Narendra modi

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో, ఇండియన్ ముజాహిద్దీన్, పీఎఫ్ఐ పేర్లలో కూడా ఇండియా ఉందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలతో సమావేశం అయిన ప్రధాని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఇటువంటి దిక్కులేని ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దేశం పేరను ఉపయోగించడం సరిపోదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటున్నాయని ఆ పార్టీల ప్రవర్తనను చూస్తే అర్థం అవుతోందన్నారు. 2024 ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు బీజేపీకే ఉందని తమ ప్రభుత్వ హయాంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Related posts

శ్రీలంకలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

ఎంజిఎం డాక్టర్ పై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే పిఏ అరెస్టు

Satyam NEWS

అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment