35.2 C
Hyderabad
April 27, 2024 13: 20 PM
Slider కడప

టీటీడీ ఆస్తులు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం

#Janasena Kadapa

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ రాయలసీమ జయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ హెచ్చరించారు. టీటీడీ ఆస్తులను పరి రక్షించ లేమని  అమ్మతామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కడప నగరంలోని జనసేన కార్యాలయంలో బీజేపీ,జనసేన పార్టీలు సంయుక్తంగా ఉపవాస దీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ  టీటీడీ ఆస్తుల అమ్మాకాలపై ప్రభుత్వం ఇచ్చిన జిఓ లను వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. పరిరక్షణకు జనసేన బీజేపీ కట్టుబడి ఉందని వారు తెలిపారు. టీటీడీ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు.

భక్తులిచ్చిన భూములను అమ్మేసేందుకు మీరెవరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కడప నియోజక వర్గ ఇంచార్జ్ కందుల శ్రీనివాస రెడ్డి, బీజేపీ జిల్లా యువ సంఘ అధ్యక్షుడు పవన్,నాయకుడు మునగా వేణుగోపాల్, జనసేన నగర అధ్యక్షుడు మాలే శివ,సలహాదారు సురేష్ బాబు,పత్తి విశ్వనాథం,రంజిత్  పాల్గొన్నారు.

Related posts

ప్రజల పై భారం మోపే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

విశాఖ‌ప‌ట్నంలో న‌వంబ‌రు 14న కార్తీక మ‌హాదీపోత్స‌వం

Murali Krishna

ఏ కారణం లేకుండా ఎలా అరెస్టు చేస్తారు?

Bhavani

Leave a Comment