మాజీ ప్రధానమంత్రి, నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా గాంధీ భవన్ లో నెహ్రు చిత్ర పటానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంత రావ్, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, నాయకులు ప్రేమ్ లాల్, కుమార్ రావ్, కైలాష్ కుమార్, ఉజ్మా షాకేర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశం నేడు అభివృద్ధి పధంలో నడుస్తుందంటే అది దేశ మొదటి ప్రధాని నెహ్రు దూర దృష్టితో చేసిన ఆలోచనలేని అన్నారు.
ఆయన స్వతంత్ర సమరయోధులు గా, ప్రథమ ప్రధానిగా దేశం కోసం ఎంతో చేశారు. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నెహ్రు త్యాగాలను తక్కువ చేసి చూపే కుట్ర చేస్తుంది.
అయితే ఈ దేశం నెహ్రు ను ఎన్నటికి మరిచిపోదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.