28.7 C
Hyderabad
April 28, 2024 10: 23 AM
Slider ప్రత్యేకం

త్వరలో జియో ల్యాప్‌టాప్‌

#jio

రిలయన్స్‌ జియో ఎట్టకేలకు ల్యాప్‌టాప్‌ను మార్కెట్ లోకి తీసుకురానున్నది.. జియోబుక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. గతంలో ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రకటించిన విధంగానే రియలన్స్‌ జియో బుక్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నది. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్‌ తొలిసేల్‌ను ప్రారంభించనున్నారు. రిలయన్స్‌ డిజిటల్‌ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. జియోబుక్‌ ల్యాప్‌టాప్‌లో 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 11.6 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. అడ్రెనో  610 జిపియు స్నాప్‌డ్రాగన్ 665 ఎస్ఓసి  ప్రాసెసర్‌ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంది.  ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ వంటి శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 4జీ సిమ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫీచర్‌ను అందించారు. వీడియో కాలింగ్‌ కోసం 2 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 2 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ జియో ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది.  ఇందులో యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ అందించారు. బ్లూటూత్, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ ల్యాప్ టాప్ ప్రారంభం ధర రూ. 15,799గా ఉండనుంది.

Related posts

ఎంపి రఘురామ పై ఎస్ సి ఎస్టీ కేసు నమోదు

Satyam NEWS

మైనార్టీ సెల్ నాయకుడికి లోకేష్ పెళ్లి కానుక

Sub Editor

RTI ఫోరం ములుగు జిల్లా ఉపాధ్యక్షునిగా బోడ రాజు

Satyam NEWS

Leave a Comment