జర్నలిస్టులు సొంత ఇంటి కల నెరవేర్చుకొనుటకై ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గురువారం కల్వకుర్తి ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న వారందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని శాసనసభ్యులు గుర్కా జయపాల్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
వినతిని స్వీకరించిన అనంతరం ఆయన సానుకూలంగా స్పందించినట్లు మండల తహశీల్దార్ కు జర్నస్ లిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని దానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా స్థల పరిశీలన చేసి అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని శాసనసభ్యులు హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి కార్తీక్ఉ పాధ్యక్షులు శ్రీధర్, రామచందర్, శ్రీను, కార్యదర్శులు రాజన్న, ఫయాజ్, పీఆర్వో సురేష్ ప్రచార కార్యదర్శి మజీద్, గౌరవ సలహాదారులు నగేష్, కృష్ణయ్య, శేఖర్ గౌడ్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.