నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలైన రాజకీయ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించారు.
ఇకపై ఏ ఎన్నికలో పోటీ చేసేది లేదని జానారెడ్డి ప్రకటించారు. అంతే కాదు, రాజకీయాలు ఇక మాట్లాడనని కూడా జానారెడ్డి అన్నారు.
నాగార్జునసాగర్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 47శాతం, కాంగ్రెస్ కు 37శాతం ఓట్లు వచ్చాయి.
నా ఆశయాలు ప్రజలకు అందితే చాలు. ఇకపై ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయను అని జానారెడ్డి నిర్వేదంగా చెప్పారు.