కడప జిల్లా కడప జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవికి మల్లెల శ్రీ వాణి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తెలుగుదేశం లో ఉన్నపుడు చురుగ్గా అన్నీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆమె ఆయన వైసీపీ లోకి వెళ్లడంతో వేగం తగ్గించారు.
టీడీపీ ఎన్నికలో పరాజయం తరువాతి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పలు ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆమె వ్యక్తి గత కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజంపేట కు చెందిన మల్లెల శ్రీ వాణి శనివారం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో వెల్లడించారు.