సినీ స్టార్ అంటే సినీ స్టారే. అందులోనూ కరీనా కపూర్ లాంటి హీరోయిన్ చేసే పని అంటే అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశం మొత్తం… దేశమేంటి? ప్రపంచం మొత్తం కరోనా ఊపేస్తున్నది.
సెకండ్ వేవ్ అదరగొడుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా…. వేయించుకున్నా కూడా మాస్క్ వాడటం తప్పని సరి అని చెబుతున్నారు.
భౌతిక దూరం పాటించడం కూడా అవసరమని అంటున్నారు. కరోనా మాస్క్ వాడాలంటే మనం ఐదు రూపాయలో పది రూపాయలో పెట్టి కొంటాం. సర్జికల్ మాస్క్ అయితే 100 నుంచి 150 రూపాయల లోపు దొరుకుతుంది.
అంత పెట్టలేని వాళ్లు నోటికి కర్చిఫ్ కట్టుకుంటున్నారు. మరి కరీనా కపూర్ ఏం చేసింది? ఇన్ స్టా గ్రామ్ లో కరీనా కపూర్ మాస్క్ పెట్టుకున్న ఒక ఫొటో పెట్టింది. ‘‘నో ప్రాపగాండా జస్ట్ వేర్ మాస్క్’’ అని కాప్షన్ పెట్టింది దానికి.
కరీనా కపూర్ పోస్టు చేసిన ఫొటోలోలో వేసుకున్న టీ షర్ట్ పై ప్రాపగాండా అని రాసిఉంది. అదీ సంగతి. అంతే కాదు ఒక బంగారు చైన్ ధరించి ఉన్నది.
ఆ ఛైన్ కు ఒక ఖరీదైన బంగారు పెండెంట్ కూడా ఉన్నది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కరీనా కపూర్ ధరించిన మాస్క్ లూయీస్ విట్టున్ కంపెనీది.
నల్ల రంగులో ఉన్న లాయీస్ విట్టున్ మాస్క్ ను ఈ మధ్య బాలివుడ్ తారలు అందరూ ధరిస్తున్నారు.
అందులో ఏం ప్రత్యేకత ఉందో మనకు తెలియదు కానీ దాని ఖరీదు మాత్రం ఒక్కొక్క మాస్క్ రూ.26,000 మాత్రమే. అక్షరాలా ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే.
వీలుంటే మీరూ కొనుక్కోండి.