తెలంగాణ భవన్లో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది.
ఈ సందర్భంగా సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చారు.
పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీఎం మార్పు గురించి ఇంకా మాట్లాడటం ఆపాలని ఆయన టీఆర్ఎస్ నేతను ఆదేశించారు.
ఈ నెల 12 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.
మార్చి నుంచి పార్టీ కమిటీల నియామకం చేస్తానని, ఏప్రిల్ లో పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు.