38.2 C
Hyderabad
April 29, 2024 19: 59 PM
Slider విశాఖపట్నం

కరోనా పాజిటీవ్ జర్నలిస్టులకు ఆహారం కిట్

#VizagCollector

కరోనా పాజిటీవ్ వచ్చిన జర్నలిస్టులకు బలవర్ధకమైన ఆహారం ఇచ్చేందుకు విశాఖపట్నం  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఒక కిట్ ను రూపొందించారు.

ఆ కిట్ లో పల్స్ ఆక్సీమీటర్  -1,   బియ్యం -10 కేజీలు, కంది పప్పు  -2 కేజీలు,  పసుపు  -¼ కేజీ, నెయ్యి – ½ కేజీ,  డ్రై ప్రూట్స్ – ½ కేజీ,  బెల్లం  -1 కేజీ,  చోడిపిండి  -1 కేజీ  మొత్తం 8 వస్తువులు ఉంటాయని తెలియజేశారు.

ఆ కిట్ లను కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు అందచేయాలని సమాచార శాఖ ఉపసంచాలకుడు వి.మణిరామ్ ను ఆదేశించారు. 

కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులు వారి పాజిటివ్ రిపోర్ట్, అక్రిడిటేషన్ జెరాక్సులను డిడి కార్యాలయంలో పి.ఆర్.వో వెంకటరాజు గౌడ్ (సెల్ నెం: 9121215255) ను సంప్రదించాలని కోరారు.

Related posts

చెత్త సేకరణ పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

లంబాడాల ఆధ్వర్యంలో హోలీ పండుగ కాముని దహనం

Satyam NEWS

బేకరీ తెరిచి ఉన్నా పట్టించుకోని పోలీసులు

Satyam NEWS

Leave a Comment