కరోనా పాజిటీవ్ వచ్చిన జర్నలిస్టులకు బలవర్ధకమైన ఆహారం ఇచ్చేందుకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఒక కిట్ ను రూపొందించారు.
ఆ కిట్ లో పల్స్ ఆక్సీమీటర్ -1, బియ్యం -10 కేజీలు, కంది పప్పు -2 కేజీలు, పసుపు -¼ కేజీ, నెయ్యి – ½ కేజీ, డ్రై ప్రూట్స్ – ½ కేజీ, బెల్లం -1 కేజీ, చోడిపిండి -1 కేజీ మొత్తం 8 వస్తువులు ఉంటాయని తెలియజేశారు.
ఆ కిట్ లను కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు అందచేయాలని సమాచార శాఖ ఉపసంచాలకుడు వి.మణిరామ్ ను ఆదేశించారు.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులు వారి పాజిటివ్ రిపోర్ట్, అక్రిడిటేషన్ జెరాక్సులను డిడి కార్యాలయంలో పి.ఆర్.వో వెంకటరాజు గౌడ్ (సెల్ నెం: 9121215255) ను సంప్రదించాలని కోరారు.