తెలంగాణ రాజకీయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఒరవడికను సృష్టించారు. అది ఏంటి అంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఎన్నికల ముందు ఆ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నాడు. అందుకే కొల్లాపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నియోజకవర్గానికి రెండు వేల కోట్లు వస్తాయని పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
సోమవారం పెంట్ల వెల్లి మండల కేంద్రంలో నాయకుల సమక్షంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు కబంధ హస్తాల్లో ఉన్న కొల్లాపూర్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించు కుంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను మోసం చేసి కన్న తల్లి లాంటి పార్టీని తుంగలో తొక్కి, స్వలాభం కోసం పార్టీ మారారు.
అందుకే ఇప్పుడు రాజీనామా చేయాలిని విజ్ఞప్తి చేశారు.కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనునిత్యం తపన పడతానని మాటలు చెప్పే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఎన్నికల ముందు కేసీఅర్ సర్కార్ వారి పాటలో రెండు వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారెమో అని చెప్పారు.
కొత్త పథకాలు, డబల్ బెడ్ రూమ్,పోడు భూములకు పట్టాలు ఇవ్వచ్చు, గొర్రెలు,బర్రెలు,నిరుద్యోగభృతి, ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తారేమో అని అన్నారు మంచి మనసున్న నాయకుడు నియోజకవర్గ అభివృద్ధికి తపనపడే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు.
లేకపోతే శాంతియుతంగా గాంధీ మార్గంలో రాజీనామా చేసే వరకు పోస్టుకార్డు ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి నాయకుడు మన్నన్, మండల కిసాన్ అధ్యక్షుడు ఖాజమైనద్దిన్,నాయకులు దర్వేష్,మహమ్మద్ షఫీ,కొండలు,నాగరాజు నిరేడు కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.