తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధితో మరణిస్తున్న వారిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కొయ్యడ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన దహనం చేయడం వెంటనే ఆపివేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర IT మంత్రి కేటీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.
ఇబ్రహీంపట్నం కి ఫ్రూట్ మార్కెట్ తీసుకురావాలని గత 6 సంవత్సరాల నుండి కోరుతున్నా తీసుకురాని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని ఫ్రూట్ మార్కెట్ తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా అక్కడ ఎలాంటి సౌకర్యం కూడా అదనంగా కల్పించలేదని ఆయన అన్నారు.