38.2 C
Hyderabad
May 1, 2024 19: 29 PM
Slider కృష్ణ

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎక్కడ ఉన్నారో…. తెలియదు…

#pattabhi

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అదృశ్యం అయ్యారు. గన్నవరంలో వైకాపా విధ్వంస కాండ జరిగింది. ఈ విధ్వంసకాండను పరిశీలించేందుకు ఆయన గన్నవరం వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగింది. విధ్వంసకాండ సృష్టించిన వైసీపీ వారిని కాకుండా తెలుగుదేశం పార్టీ వారినే పోలీసులు కట్టడి చేస్తున్నారు. గన్నవరంలో నడి రోడ్డు పై కర్రలు రాళ్లతో వైసీపీ దాడులు చేసింది. దాంతో గన్నవరంలో టెన్షన్ నెలకొన్నది. మహిళలకు తీవ్ర గాయాలు తగిలాయి. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ చేసిన దాడి విషయం తెలిసి తన భర్త అక్కడికి వెళ్లారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భార్య చందన అన్నారు. అక్కడ పోలీసులు ఆయనను అదుపులో తీసుకున్నారని, డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషల్ ఉన్నారు, కానీ తన భర్త అక్కడ లేరని చందన అన్నారు. తన భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలీదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోంది, నా భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత అని చందన వ్యాఖ్యానించారు.

Related posts

మన  ఘన  వారసత్వం

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: అల్లకల్లోలంగా పాకిస్తాన్

Satyam NEWS

ఏపీలో రేపు కూడా వడగాడ్పులు వీచే అవకాశం

Satyam NEWS

Leave a Comment