ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో తీవ్ర అపచారం జరిగింది. సినీ నటుడు రామ్ చరణ్ అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయంలో మొబైల్ ఫోన్లతో అభిమానులు వీడియోలు తీశారు.
అభిమానుల తాకిడితో ఆలయం లోపల రైలింగ్ రాడ్లు విరిగిపోయాయి. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. సాధారణ భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. దుర్గ గుడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పోలీసులు, దుర్గ గుడి అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా గందరగోళం నెలకొంది.