ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో నిర్మించనున్న సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఖమ్మం నగరంలోని 3వ డివిజన్ బల్లేపల్లి, 5వ డివిజన్ బాలాజీ నగర్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.90 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా వుండేలా అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు పల్లెబొయిన భారతి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డిఈ రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.
previous post
next post