తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. మే 25వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. L ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 37 మంది రుత్వికులు 19 హోమగుండాలలో హోమాలు నిర్వహించారు.
యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, కలశస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో రవి కుమార్, సూపరింటెండెంట్లు, అర్చక బృందం పాల్గొన్నారు.