26.7 C
Hyderabad
April 27, 2024 08: 15 AM
Slider నల్గొండ

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు

#TDPHujurnagar

సూర్యాపేట జిల్లా హజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా చౌక్ చౌరస్తాలో  పట్టణ TDP అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయిరాం గౌడ్ ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఐక్యమత్యాన్ని చాటండి, అన్న నినాదంతో మార్మోగిన రోజు మే డే అని,ప్రపంచం మొత్తం మే 1న, కార్మిక దినోత్సవంగా జరుపుకుంటుందని, సమాజ పురోగతి శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమేనని, మే డే కార్మికులు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.

వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా విధిగా మాస్కును ధరించి, శానిటైజర్ ను ఉపయోగించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చల్లా వంశీ సహాయ సహకారాలతో మాస్కులు, శానిటైజర్లు, పంపిణి చేయగా టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా సహదేవరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నలమాద శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర BC సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి గార్లపాటి శ్రీనివాస్, టీడీపీ పార్టీ పట్టణ  ప్రధాన కార్యదర్శి ఆవులపాటి శ్రీను, షేక్ చిన సైదా,చిట్యాల ఉపేందర్, గూడెపు రాములు, చల్లా అంజి, సోమనబోయిన సోమయ్య, చక్రాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ లో చేరబోతున్న బిజెపి ఎంపి తండ్రి

Satyam NEWS

జూన్ 1 నుంచి వినియోగంలోకి శిల్పారామం

Satyam NEWS

ములుగులో తెలంగాణ జాగృతి సంక్రాంతి సంబరాలు

Bhavani

Leave a Comment