కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లిలో ఆదివారం గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రము,విలేజ్ క్లినిక్లను రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. అనంతరం చింతరాజుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు సంబంధిత అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించి ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వైసీపీ తిరిగి ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించినారు. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా ఆశీర్వదించాలని కోరారు.