రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన అడుగడుగున రసాభాసగా మారింది. మంత్రి కేటీఆర్ పర్యటనను బీజేపీ, ఏబీవీపీ కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అడ్డుకున్నారు.
గత ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మండలానికి 30 పడకల ఆసుపత్రి హామీ ఇచ్చి మాట తప్పాడని బిజెపి కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి ఫ్లెక్సీ తో నిరసనకు దిగారు.
ఇది ఇలా జరుగుతుండగానే కాంగ్రెస్ శ్రేణులు మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్నారు. పర్యటనకు ముందే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వెంటనే విడుదల చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.
తమ మండలానికి 30 పడకల ఆసుపత్రి నిధులు ఇవ్వకుండా ఎలా పర్యటన చేస్తాడని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ని అడ్డుకోగా బిజెపి ఏబీవీపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
ప్రతిపక్షాల నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించగా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ పైకి వచ్చి బీజేపీ కార్యకర్తల పై దాడి చేశారు.
ఘర్షణలు అదుపులోకి రాకపోవడంతో అదనపు పోలీసు బలగాలు కావాలంటూ ఎస్సై పై అధికారులకు సమాచారం అందించారు.
మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో పలువురు ఏబీవీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
నిరుద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వడంలేదని ఆత్మహత్యలు జరుగుతున్నాయని వెంటనే నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.