వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం CMRF కు దరఖాస్తు చేసుకుని మంజూరైన 26 మందికి రూ.14.33లక్షల విలువైన చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఖమ్మం Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నేటి వరకు 1968 చెక్కులకు గాను రూ.8.41 కోట్లు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం నియోజకవర్గం నుండి మంజూరైన 37-కల్యాణలక్ష్మీ, షాది ముభారక్ పథకం ద్వారా రూ.37 లక్షల విలువైన చెక్కులను స్వయంగా మంత్రి పంపిణీ చేశారు.