గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక దఫా మంత్రిగా కొనసాగిన జోగు రామన్న మాదిగల సమస్యలు ఏనాడూ పట్టించుకోకుండా అహంకార ధోరణితో వ్యవహరిచడం బాధాకరమైన చర్య అని ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. నియోజకవర్గ పరిధిలోగానీ, జిల్లా కేంద్రంలో గానీ సంక్షేమ భవనాలు ఇవ్వకుండా మభ్యపెడుతూ అడుగు అడుగునా అభివృద్ధి విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు.
అలాగే అర్హులైన మాదిగ ఉప కులాల పేదలకు దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వమని పదే పదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగ, కో కన్వీనర్ బరుకుంట సుభాష్ మాదిగ, చిట్టి రవి మాదిగ, జనరాపు సాయి కుమార్ మాదిగ, సాయి మాదిగ, తార రవిందర్ మాదిగ, మహేష్ మాదిగ, మోతే అఖిల్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.