33.7 C
Hyderabad
April 29, 2024 00: 59 AM
Slider నల్గొండ

ఎమ్మెల్యేగా గెలిచి నీవు చేసిందేంది సైదిరెడ్డి?

#BJPHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గంలో బి.జె.పి తెరాస ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

 దుబ్బాక ఎన్నిక సందర్భంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస గెలిచి అభివృద్ధి చేసింది ఏమి లేదని బి.జె.పి రాష్ట్ర పార్టీ అధ్యక్ష్యుడు బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తెరాస యం.ఎల్.ఏ స్పందించి ఏడాది కాలంలో ఉప ఎన్నికల్లో గెలిచి హుజూర్ నగర్ నియోజక వర్గం లో ఒక్క ఏడాది లోనే 200 కోట్ల పనులు చేసి హుజూర్ నగర్ ను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నానని,  దమ్ముంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చొని తేల్చుకుందాంరా అని బండి సంజయ్ కు సైదిరెడ్డి సవాల్  విసిరారు.

దీనికి ఘాటుగా స్పందించిన సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్ష్యుడు బోబ్బా భాగ్యరెడ్డి హుజూర్ నగర్ పొట్టి శ్రీరాములు సెంటర్ లో మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజక వర్గంలో యం.ఎల్.ఏ సైదిరెడ్డి చేసింది ఏమి లేదని, మొత్తం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిధుల ద్వారానే గ్రామాలకు నిధులు వచ్చాయని, ఉపాధి హామీ పథకం క్రింద వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏమి లేవని అన్నారు.

యం.ఎల్.ఏ సైదిరెడ్డి ఏడాదిలో సొంత ఇల్లు,యం.ఎల్.ఏ క్యాంప్ కార్యాలయం కట్టుకున్నాడని, వాటి మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై లేదన్నారు. పేదలకు ఆరు సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తెరాస ప్రభుత్వం నియోజక వర్గంలో ఇవ్వలేదన్నారు.

దీనిపై సైదిరెడ్డి శ్వేత పత్రం విడుదల చేయ్యాలని, మేము కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చాయో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Related posts

పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఘనంగా న్యూ ఇయర్

Satyam NEWS

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

Satyam NEWS

అంకితభావంతో పని చేసే గాజువాక ట్రాఫిక్ సిఐ కోటేశ్వరరావు

Satyam NEWS

Leave a Comment