ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోడీ ముందు వరుసలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో సరి చూసుకుంటే ప్రధాని మోడీ టాప్ జాబితాలో ఉన్నారు.
ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు. ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది.
ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ల కంటే ప్రధాని మోడీ ముందున్నట్లు సర్వేలో తేలింది.