గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది.
గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు.
నాగార్జున నగర్ లో ఈ దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి చంపారు. ప్రత్యూష, పద్మావతి అనే ఇద్దరు తల్లీ కూతుళ్లను కత్తితో పొడవడంతో అక్కడిక్కడే ఇంట్లోనే ఇద్దరూ మృతి చెందారు.
పోలం వివాదం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానo వ్యక్తం చేశారు.
అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.