ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. సత్తుపల్లి తామర చెరువులో దూకి ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
మృతులను మృదుల, ప్రజ్ఞాన్(8), మహాన్లుగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విజయంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. మంత్రి నోటి దూల