29.7 C
Hyderabad
April 29, 2024 08: 10 AM
Slider జాతీయం

అనారోగ్యంతో ములాయం రెండో భార్య మృతి

#sadhanagupta

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ రెండో భార్య సాధన గుప్తా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సమాజ్ వాది పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి సాధన గుప్తాకు నివాళులర్పించారు. గత వారం, జూలై 1న, సాధనా గుప్తా షుగర్‌తో సహా అనేక ఇతర అనారోగ్యాల కారణంగా ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ గుర్గావ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆమె మృతదేహాన్ని విమానంలో తరలించి లక్నోకు తీసుకురానున్నారు. 2003లో సాధన గుప్తాను ములాయం తన భార్యగా అంగీకరించారు. ఆమె  కొడుకు ప్రతీక్ యాదవ్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ మృతి పట్ల సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా మృతి విచారకరమైన వార్త అని కేశవ్ ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయన పాదాల చెంత ఆమె పవిత్ర ఆత్మకు చోటు కల్పించాలని, ములాయం సింగ్ యాదవ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. “ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా మరణం గురించి విచారకరమైన సమాచారం అందింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ తీరని లోటును భరించే శక్తిని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని బ్రజేష్ పాఠక్ అన్నారు.

Related posts

జయహో భారత్

Satyam NEWS

కరోనా అదుపునకు ఎంపీ ఆదాల ఆర్థిక సాయం

Satyam NEWS

డిగ్రీ చదివే అనూషను దారుణంగా హతమార్చారు

Satyam NEWS

Leave a Comment