39.2 C
Hyderabad
April 28, 2024 11: 05 AM
Slider క్రీడలు

ఉత్సాహంగా ములుగు జిల్లా స్థాయి ఆటల పోటీలు

#Telangana sports ground

శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో, తెలంగాణ క్రీడ మైదానం, తంగెళ్ల స్టేడియంలో జిల్లా స్థాయి ఉద్యోగుల, పాత్రికేయులకు షేటిల్, క్యారం బోర్డు, చెస్, తగ్ ఆఫ్ వర్, రన్నింగ్ 200 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్పుట్, వాలీబాల్, జావిల్లింగ్ త్రో వంటి ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు విధులలో నిమగ్నమై మానసిక ప్రశాంతతను కోల్పోయిన సమయంలో ఇలాంటి ఆటల పోటీలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. ఉద్యోగులు ఇలాంటి ఆటల పోటీల కార్యక్రమాలలో పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్ డి ఆర్ ఓ కే రమాదేవి జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య జిల్లా యువజన సర్వీసులు క్రీడల అధికారి పి వెంకటరమణ చారి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు కలెక్టరేట్ సిబ్బంది ఆయా శాఖల సిబ్బంది ఫిజికల్ డైరెక్టర్లు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Satyam NEWS

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే పిల్లి కూత కూసినట్టు ఉంది

Satyam NEWS

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

Leave a Comment